శివాజీ రాజా స్నేహితుడు శ్రీలంక పేలుళ్లలో మృతి
హైదరాబాద్ : శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో హైదరాబాద్ వాసి తులసీరాం మృతిచెందారు. “మా” మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్నేహితుల్లో ఒకరైన.. శ్రీనివాస్ దగ్గరి బంధువు తులసీరాం అన్న సంగతి తెలిసిందే. షాంగ్రిలా హోటల్లో జరిగిన పేలుడులో ఆయన మృతిచెందినట్లు గుర్తించారు. శ్రీలంక పేలుళ్లపై స్పందించిన శివాజీ రాజా.. చివరి క్షణంలో శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నానని.. అందువల్లే ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని ప్రకటించారు. శ్రీలంక పేలుళ్లలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం జరిగిన వరుస […]
హైదరాబాద్ : శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో హైదరాబాద్ వాసి తులసీరాం మృతిచెందారు. “మా” మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్నేహితుల్లో ఒకరైన.. శ్రీనివాస్ దగ్గరి బంధువు తులసీరాం అన్న సంగతి తెలిసిందే. షాంగ్రిలా హోటల్లో జరిగిన పేలుడులో ఆయన మృతిచెందినట్లు గుర్తించారు. శ్రీలంక పేలుళ్లపై స్పందించిన శివాజీ రాజా.. చివరి క్షణంలో శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్నానని.. అందువల్లే ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని ప్రకటించారు. శ్రీలంక పేలుళ్లలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్ల దాడిలో మృతుల సంఖ్య 359కి పెరిగింది. మొత్తం 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.