నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ కూడా ఇచ్చేశా.. అయినా వదల్లేదు: హేమంత్ భార్య
హైదరాబాద్లో మరో పరవు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా
Honor Killing Hyderabad: హైదరాబాద్లో మరో పరవు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకున్న హేమంత్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు యువతి బంధువులు. ఈ క్రమంలో మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంటికి తీసుకెళ్తామని మాయమాటలు చెప్పి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు హేమంత్ భార్య అవంతిక తెలిపారు. నాలుగు నెలల క్రితమే తమకు పెళ్లి అయ్యిందని, పోలీసుల సమక్షంలో రాజీ కూడా కుదిరిందని ఆమె అన్నారు. బెదిరింపులు సహజంగానే వస్తూ ఉన్నాయని, తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ మొత్తం కూడా ఇచ్చేసినట్లు ఆమె వెల్లడించారు.
గురువారం మద్యాహ్నం తమ ఇంట్లోకి తన మేనమామ విజేంద్రరెడ్డితో పాటు ఇద్దరు మేనబావలు, మరొకరు వచ్చారని..మాయమాటలు చెప్పి కారులో ఎక్కించారని అన్నారు. కొంత దూరం వెళ్లాక తనకు అనుమానం వచ్చి కేకలు పెట్టానని, ఇక రింగ్ రోడ్డు వైపు తీసుకెళ్లి తనను అక్కడే వదిలేసి, హేమంత్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. తాను పోలీసులకు ఫోన్ చేశానని కానీ స్పందించలేదని, ఆ తరువాత మా అత్త మామకు కాల్ చేశానని అవంతిక పేర్కొన్నారు. 40 నిమిషాల తరువాత పోలీసులు వచ్చారని, గచ్చిబౌలి స్టేషన్కి వెళ్లి ఫిర్యాదును ఇచ్చామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల్లో కొల్లూరు వద్ద పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అతన్ని తీసుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని, ఇవాళ ఉదయం హేమంత్ చనిపోయినట్లుగా పోలీసులు చెప్పారని ఆమె వివరించారు. కాళ్లు చేతులు కట్టేసి దారుణంగా హేమంత్ని హత్య చేశారని అవంతిక ఆవేదన వ్యక్తం చేశారు.
Read More: