గులాబీ గెలుపు నల్లేరు మీద నడకేనా..?
హుజూర్ నగర్ బైపోల్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారిన అంశం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. అయితే ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తోందనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ వశం చేసుకుంటుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది అందని ద్రాక్షగా మిగిలింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి హుజూర్నగర్ను దక్కించుకోవాలన్న నిశ్చయంతో పక్కా ప్లాన్లు వేసింది టీఆర్ఎస్. […]
హుజూర్ నగర్ బైపోల్ : హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్టాపిక్గా మారిన అంశం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో ఈ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. అయితే ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తోందనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ వశం చేసుకుంటుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది అందని ద్రాక్షగా మిగిలింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి హుజూర్నగర్ను దక్కించుకోవాలన్న నిశ్చయంతో పక్కా ప్లాన్లు వేసింది టీఆర్ఎస్. అయితే
నామినేషన్ల పర్వం వరకు గెలుపు ద్విముఖ పోరు అనుకున్నా.. వాస్తవాలు చూస్తే హుజూర్నగర్ సీటు ఈ సారి టీఆర్ఎస్ కోటాలో చేరినట్లే అనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు ఓ అడుగు దిగాలన్నది రాజకీయ చతురత. ఆ రాజకీయ చతురతను పక్కా ఉపయోగించింది టీఆర్ఎస్ పార్టీ. హుజూర్నగర్లో గెలుపు అంత ఈజీ కాదు అనుకున్న టీఆర్ఎస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేసింది. ఇప్పటి వరకు ఒంటరిగా పోటీ దిగిన టీఆర్ఎస్ అనూహ్యంగా సీపీఐతో పొత్తుపెట్టుకుంది. ఇదే టీఆర్ఎస్ గెలుపుకు నాంధి పలకనుంది. దీనికి కారణం ఇదే సీపీఐ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మద్దతు పలికింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు టీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక సమీకరణాలు చూస్తే.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా శానంపూడి సైదిరెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపింది. అప్పుడు కాంగ్రెస్పై కేవలం ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే అప్పుడు కాంగ్రెస్ మహాకూటమి నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్కు మద్దతుగా టీజేఎస్, టీడీపీ, సీపీఐ పార్టీలు మద్దతునిచ్చాయి. అయితే ఈ సారి కాంగ్రెస్కు అప్పటి మిత్రపక్షాలు ఇప్పుడు దూరమయ్యాయి. టీడీపీ బరిలోకి దిగడం.. సీపీఐ టీఆర్ఎస్ పక్కన చేరడం కాంగ్రెస్కు మైనస్గా మారింది. ఇక టీజేఎస్ మద్దతు తెల్పినా.. ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. ఇక అప్పుడు బీజేపీ నామమాత్రంగా పోటీ ఇచ్చినా.. ఈ సారి మాత్రం ఓటు బ్యాంకు పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు టీడీపీ కూడా ఒంటరిగా బరిలోకి దిగి.. రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు గట్టిపోటీ ఇచ్చేందుకే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ అంశాలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా మారగా.. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. అంతేకాదు.. హుజూర్నగర్ నియోజకవర్గం ఏపీ బార్డర్లో ఉండటం.. కాస్త సెంటిమెంట్ కూడా ఇక్కడ వర్క్అవుట్ అవుతుంది. అయితే ఈ ఓట్లన్నీ ఇప్పుడు టీడీపీ కొంచెం బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా వైసీపీ కూడా టీఆర్ఎస్కే మద్దతు తెల్పడంతో ఈ ఓట్లు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకే పడే అవకాశం ఉంది. ఈ సమీకరణాల దృష్ట్యా హుజూర్నగర్ సీటు కూడా అధికార పార్టీలో చేరేలా ఉంది.