గుంటూరు జిల్లాలో దారుణం.. నవ వధువుకు తొలిరాత్రే కాళరాత్రి.. నరకం చూపించిన భర్త..

గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికానికి నవ వధువును నరకయాతన అనుభవించింది. కోటి కలలతో సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి తొలిరాత్రే భర్త ప్రవర్తనతో మతిపోయింది. తనపై భర్త పైశాచికంగా ప్రవర్తించి, గాయపరిచాడంటూ పోలీసులను ఆశ్రయించింది. భర్త చేసిన ఆకృత్యాలను చెప్పలేక ఫిర్యాదు రూపంలో గోడు వెల్లబోసుకుంది.

గుంటూరు జిల్లాలో దారుణం.. నవ వధువుకు తొలిరాత్రే కాళరాత్రి.. నరకం చూపించిన భర్త..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 3:01 PM

Husband Satanism: గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి పైశాచికానికి నవ వధువును నరకయాతన అనుభవించింది. కోటి కలలతో సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి తొలిరాత్రే భర్త ప్రవర్తనతో మతిపోయింది. తనపై భర్త పైశాచికంగా ప్రవర్తించి, గాయపరిచాడంటూ పోలీసులను ఆశ్రయించింది. భర్త చేసిన ఆకృత్యాలను చెప్పలేక ఫిర్యాదు రూపంలో గోడు వెల్లబోసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన యువతి కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో అక్టోబరు నెలలో వీరికి వివాహమైంది.

అయితే, కోటి ఆశలతో కొత్త కాపురంలో అడుగుపెట్టిన నవ వధువుకు మొదటిరాత్రి భర్త ప్రవర్తనతో విసుగు చెందింది. కాగా, అతడు భయపడుతున్నాడని భావించి రోజులు గడుపుకుంటూ వచ్చింది ఆ వధువు. రెండురోజుల కిందట మళ్లీ మొదటి రాత్రి ఏర్పాటు చేయగా అతను ఆమె నైటీ వేసుకొని వింతగా ప్రవర్తించాడు. అంతేగాక, ఆమెకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బ్లేడ్‌తో ఆమె చెప్పరాని చోట శరీరంపై గాయపర్చాడు. వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసింది. దీంతో వరుడి బంధువులను సంప్రదించగా వధువే సంసారానికి పనికిరాదంటూ గొడవకు దిగారు. దీంతో గాయాలతో ఉన్న ఆమెను తీసుకొని తల్లిదండ్రులు గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చి ఫిర్యాదు చేశారు. స్పందన అధికారులు వెంటనే నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. యువకుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.