సైనా నెహ్వాల్పై భర్త కశ్యప్ తీవ్ర అసహనం
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నుంచి సైనా నెహ్వాల్ వైదొలిగింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తైవాన్కు చెందిన వరల్డ్ నెంబర్ 1 తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ అక్కడే ఉన్న సైనా నెహ్వాల్ భర్త కశ్యప్ తన భార్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షటిల్ను కంట్రోల్ చేస్తూ షాట్లు ఆడమని గైడ్ చేశాడు. డ్రాప్ షాట్లను లిఫ్ట్ చేస్తూ ప్రత్యర్ధికి కోర్టుంతా ఖాళీగా […]
బర్మింగ్హామ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నుంచి సైనా నెహ్వాల్ వైదొలిగింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తైవాన్కు చెందిన వరల్డ్ నెంబర్ 1 తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ అక్కడే ఉన్న సైనా నెహ్వాల్ భర్త కశ్యప్ తన భార్యపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. షటిల్ను కంట్రోల్ చేస్తూ షాట్లు ఆడమని గైడ్ చేశాడు.
డ్రాప్ షాట్లను లిఫ్ట్ చేస్తూ ప్రత్యర్ధికి కోర్టుంతా ఖాళీగా చూపిస్తున్నావంటూ కోప్పడ్డాడు. అయినప్పటికీ మ్యాచ్ను సైనా నెహ్వాల్ ప్రత్యర్ధికి సులభంగా ఇచ్చేసింది. ప్రారంభమైన 37 నిమిషాల్లోనే సైనా ఓడిపోయింది. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.