High Court: ముస్లిం మహిళలకు గుడ్ న్యూస్.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం మహిళలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది.
Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం మహిళలకు అనుకూలంగా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 ప్రకారం భర్త నుండి భరణం పొందే హక్కు ఉందని పేర్కొంది. అలాగే ఇద్దత్ కాలం తర్వాత కూడా పొందవచ్చని చెప్పారు. విడాకులు తీసుకున్న మహిళలు మళ్లీ పెళ్లి చేసుకునే వరకు ఈ హక్కు ఉంటుందని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
పిటిషనర్ రజియా క్రిమినల్ రివిజన్ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్కు చెందిన జస్టిస్ కరుణేష్ సింగ్ పవార్తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. 2008లో దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్లో ప్రతాప్గఢ్లోని సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేశారు. సెషన్స్ కోర్టు, దిగువ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేస్తూ, ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం ప్రవేశపెట్టిన తర్వాత, పిటిషనర్ మరియు ఆమె భర్త కేసు ఈ చట్టానికి లోబడి ఉండాలి. సెషన్స్ కోర్టు పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 3 మరియు 4 ప్రకారం, ముస్లిం విడాకులు తీసుకున్న భార్యకు మాత్రమే భరణం లభిస్తుంది. అటువంటి సందర్భాలలో CrPC యొక్క సెక్షన్ 125 వర్తించదు.
సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని పక్కనపెట్టిన ధర్మాసనం.. షబానా బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ముస్లిం విడాకులు తీసుకున్న మహిళ ఇద్దత్ కాలం తర్వాత కూడా సెక్షన్ 125 ప్రకారం భరణం పొందేందుకు అర్హురాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఆమె మరొక వివాహం చేసుకునే వరకు ఈ భరణం పొందే హక్కు ఉంటుందని వెల్లడించింది.
‘ఇద్దత్’ అంటే ఏమిటి
‘ఇద్దత్’ అంటే స్త్రీ భర్త మరణించిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత కొంత కాలం వరకు భర్త నుండి దూరంగా ఉండటం. ‘ఇద్దత్’ వ్యవధి మూడు రకాలుగా ఉంటుంది. ఒక వృద్ధ మహిళ నాలుగు నెలల 10 రోజులలో, ఆ తర్వాత ఒక యువతికి మూడు నెలల రుతుక్రమం సమయంలో మరొక పురుషుడి ఎదుటకు రాకుండా ఉండాలి. ఇది కాకుండా, గర్భిణీ స్త్రీ ఇద్దత్ ఒక బిడ్డకు జన్మనివ్వడంతో ముగుస్తుంది.
Read Also… SBI: బ్యాంకులో దొంగలు పడ్డారు.. ఏస్బీఐ బ్రాంచ్లో రూ.11 కోట్ల నాణేలు మాయం.. రంగంలోకి సీబీఐ