ఆ చెట్టును చూడాలంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే.. ఇంతకీ దాని స్పెషలెంటో తెలుసా..

శరదృతువులో చెట్లకు ఆకులన్ని రాలిపోతుంటాయి. ఆకుపచ్చగా ఉండే చెట్ల ఆకులు.. వివిధ రంగుల్లోకి మారి రాలిపడుతుంటే.. నేలంతా పూలపాన్పులా కనిపిస్తుంటుంది.

ఆ చెట్టును చూడాలంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే.. ఇంతకీ దాని స్పెషలెంటో తెలుసా..
Follow us

|

Updated on: Mar 05, 2021 | 9:25 PM

శరదృతువులో చెట్లకు ఆకులన్ని రాలిపోతుంటాయి. ఆకుపచ్చగా ఉండే చెట్ల ఆకులు.. వివిధ రంగుల్లోకి మారి రాలిపడుతుంటే.. నేలంతా పూలపాన్పులా కనిపిస్తుంటుంది. కొన్ని రకాల చెట్లకు ప్రత్యేకతలుంటాయి. వాటిని చూడాటానికి చాలా మంది ఉత్సాహాన్ని కనబరుస్తుంటారు. అలాంటి చెట్టే ఒకటి ఉంది. దానిని చూడాలంటే రిజర్వేషన్ చేయించుకోవాలి. అవును ఇది నిజమే. ఆ చెట్టుకు అంత స్పెషాలిటీ ఉంది. మరీ అదెంటో తెలుసుకుందామా.

చైనాటౌన్‌లోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని జోంగ్‌నాన్‌ పర్వతాల ప్రాంతంలో ఉందీ గునియిన్‌ గుమియవో అనే బౌద్ధుల ఆలయం. ఆ ప్రావిన్స్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ఈ ఆలయంలో ఉన్న గింగ్‌కొ బిలోబా అనే చెట్టు పర్యటకులను కనులకింపుగా కనిపిస్తుంది. ఈ రకం చెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా ఈ ఆలయంలోని చెట్టు మాత్రం చాలా ప్రాచీనమైనది. ఈ చెట్టు 1400 సంవత్సరాల కిందటిదని, 618-907 మధ్య ఉన్న టాంగ్‌ రాజ్యాన్ని పరిపాలించిన లి షిమిన్‌ దీన్ని నాటినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టుగానూ ఇది గుర్తింపు పొందింది. ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు ఆకులు శరదృతువులో బంగారువర్ణంలోకి మారి రాలిపోతుంటాయి. ఆ ఆకులన్నీ నేలపై పడుతుంటే సుందరదృశ్యం ఆవిష్కృతమవుతుంటుంది. నేలంతా స్వర్ణశోభితంగా.. కనులవిందుగా కనిపిస్తుంది. నిజానికి, శరదృతువు ప్రారంభంలో ఈ చెట్టు వద్ద స్థానికులు మాత్రమే వేడుకలు నిర్వహించేవారు. కొన్నాళ్ల కిందట ఈ చెట్టు అందాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో దేశవిదేశాల నుంచి పర్యటకుల రాక మొదలైంది. మాములు రోజుల్లో పర్యటకులు తక్కువగానే ఉన్నా.. అక్టోబర్‌ నెలఖారు నుంచి డిసెంబర్‌ తొలివారం వరకు కనీసం 60వేల మంది పర్యటకులు ఈ చెట్టును సందర్శిస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అయితే పర్యటకులు భారీ సంఖ్యలో వస్తుండటంతో రోజుకు ఏడు నుంచి ఎనిమిది వేల మందిని అనుమతించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పర్యటకులు ఈ చెట్టును సందర్శించడం కోసం ముందుగానే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. రిజర్వేషన్‌ చేసుకొని వచ్చినా.. మూడు నుంచి నాలుగు గంటలు క్యూలో నిలబడితేనే ఆ చెట్టు దర్శన భాగ్యం కలుగుతోందట. ప్రస్తుతం కరోనా కారణంగా విదేశీ పర్యటకులు సంఖ్య తక్కువగానే ఉన్నా.. దేశీయ పర్యటకులు మాత్రం ఈ చెట్టును చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

Also Read:

సంవత్సరానికి కేవలం 5 గంటలు మాత్రమే తెరచి ఉండే ఆలయం.. అమ్మవారికి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.. ఎక్కడుదంటే..