మీ ఇంట్లో ఉండే మొక్కలపై ఇలాంటి తెల్లటి మరకను చూస్తున్నారా..! ఈ వ్యాధి ఏంటో తెలుసుకోండి..
చాలాసార్లు పొలంలోని మొక్కలపై కొన్ని కీటకాలు కనిపిస్తాయి. ఇవి పంట మొత్తం నాశనం చేస్తాయి. వర్షకాలంలో కొన్ని ప్రత్యేక కీటకాలు
చాలాసార్లు పొలంలోని మొక్కలపై కొన్ని కీటకాలు కనిపిస్తాయి. ఇవి పంట మొత్తం నాశనం చేస్తాయి. వర్షకాలంలో కొన్ని ప్రత్యేక కీటకాలు మీరు చూసే ఉంటారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. వీటిని బగ్స్ అంటారు. ఈ కీటకాలు మొక్కల నుంచి పోషకాలను పీల్చుకుంటాయి. చెట్లను నిర్వీర్యం చేస్తాయి. ఇవి ఇండ్లలో పెంచుకునే మొక్కలపై కూడా కనిపిస్తాయి. బగ్స్ మొక్కలు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలకు చాలా హాని చేస్తాయి. పండు పక్వానికి రాకముందే మొక్క నుంచి కిందపడిపోతుంది. ఈ బగ్స్ తేమ, వేడి వాతావరణంలో కూడా పైరుపై, చెట్లపై దాడి చేస్తాయి.
ముందుగా మొక్క ఆరోగ్యం బాగుందో లేదో చూడాలి. సాధారణంగా బగ్స్ బలహీనమైన మొక్కలపై దాడి చేస్తుంది. అవి తేమ, వేడి ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల ఇంట్లో ఉంచిన మొక్కల ఉష్ణోగ్రత 15 ° C తగ్గిస్తే బగ్స్ అటాక్ చేయలేవు. ఇది కాకుండా మార్కెట్లో అనేక రకాల స్ప్రేలు, ఎరువులు కూడా దొరుకుతాయి. వ్యాధి సోకిన మొక్కలపై వేపనూనె పూయడం వల్ల కూడా వీటిని వదిలించుకోవచ్చు.
బగ్ సంక్రమణ తర్వాత మొక్కలను ఎలా రక్షించాలి
1. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉపయోగించండి: మొక్కకు బగ్ పురుగులు ఉన్నట్లు గుర్తించినప్పుడు ముందుగా ఆకులపై గరిష్టంగా 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ని పరీక్షించండి. ఒకవేళ పరీక్ష విజయవంతమైతే ఈ ద్రావణాన్ని మొక్క సోకిన భాగంలో రుద్దండి. ఇది కీటకాలను సమూలంగా నాశనం చేస్తుంది.
2. పురుగుమందు సబ్బును ఉపయోగించండి : పురుగుమందు సబ్బు కూడా మీలీ బగ్ను తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ క్రిమిసంహారక సబ్బును మార్కెట్ నుంచి కొనడమే కాదు ఇంట్లో కూడా తయారు చేయవచ్చు. ఈ రకమైన సబ్బును ఉపయోగిస్తున్నప్పుడు ఇది మొక్కల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి.
3. రసాయనిక పురుగుమందుల వాడకం : బగ్స్ని పూర్తిగా తొలగించడానికి మార్కెట్లో అనేక రకాల పురుగుమందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించవచ్చు. అయితే అధిక వినియోగం మొక్కలకు మాత్రమే కాకుండా మానవులకు కూడా హానికరమని గుర్తించండి.