Mobile Phone: మొబైల్ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా..! అయితే మీరే నెంబర్ వన్..? ఎలాగంటే..
Mobile Phone: ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా భారత్లో లభిస్తుంది. దీంతో మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృథా చేయడంలో భారతీయులు చైనా, అమెరికాలను కూడా
Mobile Phone: ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా భారత్లో లభిస్తుంది. దీంతో మొబైల్ ఫోన్లలో సమయాన్ని వృథా చేయడంలో భారతీయులు చైనా, అమెరికాలను కూడా అధిగమించారు. 2014లో భారత్లో 1 జీబీ డేటా కోసం రూ.269 వెచ్చించాల్సి వచ్చేది. కానీ 6 ఏళ్లలో డేటా ధర 96% తగ్గి రూ.10.93కి చేరింది. మొబైల్ మార్కెట్ స్పాట్లైట్ రిపోర్ట్ 2021 ప్రకారం.. చౌక డేటా కారణంగా భారతీయులు మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయాన్ని వృథా చేస్తున్నారు.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఒక భారతీయుడు సగటున 4.6 గంటలు మొబైల్ ఫోన్లలో గడిపాడు. 2జీ సర్వీస్ ఉన్న ఏరియాలోనే ఇలా ఉంటే 4జి, 5జి వస్తే ఏమవుతుందో మీరు ఊహించుకోవచ్చు. ఇదిలా ఉంటే యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసే చైనా సొంత ప్రజల నిర్ణయం వల్ల కష్టాల్లో కూరుకుపోతుంది. చైనా జనాభా శరవేగంగా వృద్ధాప్యానికి గురవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చైనా ప్రజల నిర్ణయం భవిష్యత్తుపై ఉన్న ఆశలను కూడా నాశనం చేస్తుంది.
చైనాలో పెళ్లికి దూరంగా ఉంటున్న యువత పెళ్లి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న యువతలో చైనాలో చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో గత మూడు నెలల్లో కేవలం 1.7 మిలియన్ జంటలు మాత్రమే పెళ్లి చేసుకున్నట్లు చైనా పౌర మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. మంత్రిత్వ శాఖ సర్వేలో, 43% మంది మహిళలు తాము వివాహం చేసుకోబోమని లేదా వివాహం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నారు. చైనాలోని నగరాల్లో నివసిస్తున్న సంపన్న యువత పెళ్లికి దూరంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. కాగా గ్రామంలో నివసించే ఆర్థిక స్థోమత లేని వారే ఎక్కువగా వివాహాలు చేస్తున్నారు.
ఇదే ట్రెండ్ కొనసాగితే దేశం సర్వ నాశనమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త తరం సిద్ధంగా ఉండదు కాబట్టి వృద్ధ దేశంగా మిగిలిపోతుంది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనే ప్రణాళికలను ప్రకటించాడు కానీ దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.