ఎస్వీబీసీ ట్రస్టుకు భారీ విరాళం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని పేరు చెబితేనే పులకించిపోయే భక్తులు ఎందరో. ఆ దేవదేవునికి తమవంతు సేవచేసే భాగ్యం కావాలని ఎంతోమంది క్యూకడుతుండం ఏళ్లకేళ్లుగా చూస్తున్నాం. తాజాగా టిటిడి..
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని పేరు చెబితేనే పులకించిపోయే భక్తులు ఎందరో. ఆ దేవదేవునికి తమవంతు సేవచేసే భాగ్యం కావాలని ఎంతోమంది క్యూకడుతుండం ఏళ్లకేళ్లుగా చూస్తున్నాం. తాజాగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వహక సభ్యులైన విజయవాడకు చెందిన బి.వి.సుబ్బరావు శ్రీవారి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్కు పది లక్షల రూపాయల విరాళంగా అందించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఈ విరాళం చెక్కును సుబ్బరావు టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు. ఇలాఉండగా, టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 14వ తేదీ లోగా 100 పడకల చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బర్డ్ ఆసుపత్రి భవనాల్లో ప్రారంభించేందుకు నిర్ణయించిన పనులు చకచకా సాగుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి చే ఆసుపత్రి సొంత భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేయించి, అదే రోజు నుంచి వైద్య సేవలు ప్రారంభించనున్నారు.