హుజూర్నగర్లో కారు జోరు.. భారీగా బెట్టింగుల హోరు!
హుజుర్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యి మూడు గంటలు గడవక ముందే ఫలితం ఎవరి వైపు వస్తుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. కారు దూకుడుతో.. టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు తేలిపోయింది. ఇప్పటికే 17,400 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్న కారు.. చివరి రౌండ్ ముగిసేసరికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికపై బెట్టింగ్ బాబులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. భారీ ఉత్కంఠ ఏర్పడిన ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై […]
హుజుర్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యి మూడు గంటలు గడవక ముందే ఫలితం ఎవరి వైపు వస్తుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. కారు దూకుడుతో.. టీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపు తేలిపోయింది. ఇప్పటికే 17,400 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్న కారు.. చివరి రౌండ్ ముగిసేసరికి భారీ మెజార్టీ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికపై బెట్టింగ్ బాబులు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. భారీ ఉత్కంఠ ఏర్పడిన ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్టపికే నియోజకవర్గం వ్యాప్తంగా నేతలు బెట్టింగ్లు కాసినట్టు సమాచారం. విజయం మీదనే కాకుండా మెజార్టీ మీద కూడా జోరుగా పందాలు సాగుతున్నట్లు వినికిడి.
సొంత పార్టీ నేతలతోనే కాకుండా ఇతర పార్టీల నేతలతో కూడా బెట్టింగ్లకు దిగినట్లు తెలుస్తోంది. అంతేకాక నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు రూ.10 కోట్లకు పైగానే బెట్టింగ్ నడుస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ నెల 21న జరిగిన పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కొందరు బెట్టింగ్కు దిగితే.. మరికొందరు గత అనుభవాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏది ఏమైనా అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయుళ్లే ఫలితాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు.