“ధోనీ కష్టం ప్రపంచం చూడాలి..క్రికెట్ త్వరగా మొదలవ్వాలి”
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా.. ధోని గురించి కొన్ని అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే బాగా రెడీ అయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడంతో క్రికెటర్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో విలువైన సమయాన్నిగడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా.. ధోని గురించి కొన్ని అభిప్రాయాలను పంచుకున్నాడు. ఐపీఎల్ కోసం ధోనీ మునుపటికంటే బాగా రెడీ అయ్యాడని క్రికెటర్ సురేశ్ రైనా చెప్పుకొచ్చాడు.
2019 ప్రపంచ కప్ తర్వాత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టని విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ కోసం ధోనీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడని చెప్పాడు రైనా. ‘ధోనీతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ఇన్ని ఇయర్స్ లో ధోనీ ఈ విధంగా సాధన చేయడం నేను చూడలేదు. మళ్లీ త్వరగా క్రికెట్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. అప్పుడే ధోనీ ప్రాక్టీస్కు ఫలం దక్కుతుంది. అతడు ఏ స్థాయిలో సాధన చేశాడో అందరికీ తెలుస్తుంది’ అని రైనా పేర్కొన్నాడు. దేనినైనా సాధించడానికి మనం వంద శాతం కృషి చేసినప్పుడు వారికి అందరి ఆశీస్సులు తప్పక లభిస్తాయని రైనా తెలిపాడు.