హాంకాంగ్ ఎన్నికల్లో నిరసనకారుల విజయకేతనం.. చైనా ఆక్రోశం
హాంకాంగ్ లో 452 కౌన్సిల్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాద అభ్యర్థులు మెజారిటీ సాధించే దిశగా సాగుతున్నారు. దాదాపు 90 శాతం సీట్లను ప్రోడెమోక్రసీ క్యాండిడేట్స్ గెలుచుకున్నారు. ఈ సరికొత్త పరిణామం.. ఇప్పటికే అప్రదిష్టను మూటగట్టుకున్న నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ కు దెబ్బేనని భావిస్తున్నారు. తనకు సైలెంట్ మెజారిటీ ఉందని చెప్పుకున్న ఈమె.. ప్రజల అభిప్రాయాలను సహనంతో వినాలని పిలుపునిస్తున్నారు. హాంకాంగ్ లో నెలల తరబడి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిని హ్యాండిల్ చేయలేక […]
హాంకాంగ్ లో 452 కౌన్సిల్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాద అభ్యర్థులు మెజారిటీ సాధించే దిశగా సాగుతున్నారు. దాదాపు 90 శాతం సీట్లను ప్రోడెమోక్రసీ క్యాండిడేట్స్ గెలుచుకున్నారు. ఈ సరికొత్త పరిణామం.. ఇప్పటికే అప్రదిష్టను మూటగట్టుకున్న నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ కు దెబ్బేనని భావిస్తున్నారు. తనకు సైలెంట్ మెజారిటీ ఉందని చెప్పుకున్న ఈమె.. ప్రజల అభిప్రాయాలను సహనంతో వినాలని పిలుపునిస్తున్నారు.
హాంకాంగ్ లో నెలల తరబడి కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిని హ్యాండిల్ చేయలేక చేతులెత్తేసిన చైనా పట్ల ‘ ఓట్ల ‘ రూపంలో ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా దీన్ని భావిస్తున్నారు. సోమవారం ఉదయం కూడా ఓట్ల లెక్కింపు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 452 జిల్లా కౌన్సిల్ సీట్లలో మెజారిటీ ఓట్లను ప్రోడెమోక్రసీ శిబిరం కైవసం చేసుకుందని హాంకాంగ్ మీడియా పేర్కొంది. ఈ జిల్లా మండళ్లకు సంబంధించి బస్సు రూట్లు, చెత్త సేకరణ వంటి స్థానిక సమస్యల విషయంలో చైనా అనుకూల అభ్యర్థులు డామినేట్ చేస్తూ వచ్చారు. కానీ తాజా ఫలితాలు మాత్రం వీరికి, క్యారీ లామ్ కు శరాఘాతంగా ఉన్నాయి. ఏమైనా ఈ రిజల్ట్స్ ను ప్రోడెమోక్రసీ సపోర్టర్లు, విజేతలు ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వింత పోకడను చైనా జీర్ణించుకోలేకపోతోంది.