కోలుకున్న అమిత్ షా, త్వరలో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

అస్వస్థత  కారణంగా  ఢిల్లీలోని ఎయిమ్స్ లో  చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయనను త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్టు ఈ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మొదట కోవిడ్ పాజిటివ్ లక్షణాలతో..

కోలుకున్న అమిత్ షా, త్వరలో ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2020 | 5:45 PM

అస్వస్థత  కారణంగా  ఢిల్లీలోని ఎయిమ్స్ లో  చేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయనను త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్టు ఈ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మొదట కోవిడ్ పాజిటివ్ లక్షణాలతో ఆయన ఈ నెల 2 న గుర్ గావ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే అలసట, స్వల్ప ఛాతీ నొప్పితో ఆయన ఈ నెల 18 న ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, నేడో రేపో డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యాన ప్రత్యేక వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. హాస్పటల్ లో ఉన్నప్పటికీ ఆయన తన అధికారిక కార్యకలాపాలను అక్కడి నుంచే నిర్వహిస్తూ వచ్చారు.