బిల్లుల ఆమోదం సరికొత్త వ్యవసాయ శకానికి నాంది, అమిత్ షా

రైతు  బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యవసాయ  రంగ సరికొత్త శకానికి నాంది అని హోమ్ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఈ  రంగ అభివృద్దికి ఇది ప్రారంభం.. ఈ బిల్లుల ఆమోదంతో రైతులకు ఇతోధిక ప్రయోజనం చేకూరుతుంది.

బిల్లుల ఆమోదం సరికొత్త వ్యవసాయ శకానికి నాంది, అమిత్ షా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 21, 2020 | 11:32 AM

రైతు  బిల్లులను పార్లమెంట్ ఆమోదించడాన్ని వ్యవసాయ  రంగ సరికొత్త శకానికి నాంది అని హోమ్ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఈ  రంగ అభివృద్దికి ఇది ప్రారంభం.. ఈ బిల్లుల ఆమోదంతో రైతులకు ఇతోధిక ప్రయోజనం చేకూరుతుంది అని ఆయన ట్వీట్ చేశారు. రైతుల బాగుకోసం కృషి చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి ఇది ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా చీకటిలో మగ్గిపోయిన అన్నదాతలకు ఇది ఆశాకిరణమన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ప్రజలను పక్కదారి పట్టించడానికి యత్నిస్తున్నాయని ఆయన ఆ ఆరోపించారు.