ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
జమ్ముకశ్మీర్లో భదత్రా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేశారు. కుప్వారాలోని లాల్పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిద్దీన్..
జమ్ముకశ్మీర్లో భదత్రా బలగాలు మరో విజయాన్ని సాధించాయి. ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేశారు. కుప్వారాలోని లాల్పోరా, లోలాబ్ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఐదుగురు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను అరెస్ట చేశారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనంచ చేసుకున్నారు. అరెస్టైన వారిని పర్వేజ్ అహ్మద్ భట్, అల్తాఫ్ అహ్మద్ మిర్, గౌస్ మహ్మద్, నజీముద్దీన్ గుజ్జర్, అబ్దుల్ ఖయ్యుమ్లుగా గుర్తించారు. జమ్ముకశ్మీర్ పోలీసులు ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఇదిలావుంటే.. గత కొద్ది రోజులుగా ఉగ్ర స్థావరాలను కూడా జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు గుర్తించి సీజ్ చేశాయి. వీటిలో కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా తనిఖీలు చేపడుతున్నారు.
A joint search operation was launched late evening yesterday in Lalpura, Kupwara on Jammu & Kashmir Police inputs. Three suspects apprehended. 1 AK & 2 pistols with magazines & ammunition recovered. Joint operation in progress: Chinar Corps, Indian Army. pic.twitter.com/PG09SPwoIh
— ANI (@ANI) August 11, 2020
Read More :