ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా ప్రజలపై ఏపీ పోలీసుల ప్రవర్తన చట్ట విరుద్దంగా వుందని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ఆందోళనలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను, మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లో నెలకొన్న అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. 144 సెక్షన్, లాఠీఛార్జ్ వంటి అంశాలను సుమోటోగా తీసుకొన్న హైకోర్టు.. శాంతియుత నిరసనలకు కూడా అనుమతి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించింది. […]

ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
Follow us

|

Updated on: Jan 13, 2020 | 3:58 PM

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా ప్రజలపై ఏపీ పోలీసుల ప్రవర్తన చట్ట విరుద్దంగా వుందని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ఆందోళనలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను, మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లో నెలకొన్న అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.

144 సెక్షన్, లాఠీఛార్జ్ వంటి అంశాలను సుమోటోగా తీసుకొన్న హైకోర్టు.. శాంతియుత నిరసనలకు కూడా అనుమతి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించింది. తాజా పరిణామాలపై పలువురు హైకోర్టు న్యాయవాదులు హైకోర్టులో మొత్తం ఏడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు అసలు రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.

గ్రామీణ ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ జరగటం ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు.. కర్ఫ్యూ వాతావరణం అమలులో ఉన్నట్లు కనిపిస్తుందని హైకోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనలకు అనుమతి ఎందుకు ఇవ్వటం లేదని పోలీసు ఉన్నతాధికారులను నిలదీసింది. మహిళలను, పిల్లలను కూడా బయటకు రానివ్వకపోవడంపై అభ్యంతరం తెలిపింది. కనీస అవసరాల కోసం కూడా అనుమతించడం లేదని పలువురు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దాఖలైన అన్ని పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!