Breaking news: సచివాలయం కూల్చివేతపై మరోసారి స్టే
సచివాలయ భవనాల కూల్చివేతకు అనుమతులిచ్చిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సచివాలయ భవనాలను కూల్చివేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతపై హైదరాబాద్ హైకోర్టు మరోసారి స్టే విధించింది. జులై 15వ తేదీ వరకు సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపి వేయాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయ భవనాల కూల్చివేతతో కాలుష్యం పెరిగి పోతుందంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపింది.
సచివాలయ భవనాల కూల్చివేతకు అనుమతులిచ్చిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. సచివాలయ భవనాలను కూల్చివేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వివరాలను కూడా సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేబినెట్ నిర్ణయంపై సోమవారం సాయంత్రానికి కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై రిప్లై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనానికి నివేదించారు. దాంతో తదుపరి విచారణను జూలై 15వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం.. అప్పటివరకు సచివాలయం కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.