రాంగోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట
సంచలనాలకు మారుపేరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. అతను రూపొందిస్తున్న 'మర్డర్' సినిమా విడుదలను ఆపేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై..
సంచలనాలకు మారుపేరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. అతను రూపొందిస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. దిగువ కోర్టు తీర్పుని సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది . ఈ అంశంపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇలాఉండగా, నల్గొండలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ ‘మర్డర్’ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి, భార్య అమృత నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.