మోకాళ్లపై తిరుమలకు ఫ్యాన్.. రామ్, ఛార్మీ షాక్

తమ ఇష్టమైన నటులు, నటీమణుల పట్ల ఫ్యాన్స్ అమితమైన ప్రేమ, అభిమానం చూపించడం..వారికి గుడికి కట్టేయడం వంటివి ఎక్కువగా కోలీవుడ్‌లో చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని విభిన్న రూపంలో చాటుకుంటున్నారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ రామ్‌ని అభిమానించే సందీప్‌ అనే వ్యక్తి  తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కారు. సినిమా […]

మోకాళ్లపై తిరుమలకు ఫ్యాన్.. రామ్, ఛార్మీ షాక్
Follow us

|

Updated on: Jul 09, 2019 | 5:05 PM

తమ ఇష్టమైన నటులు, నటీమణుల పట్ల ఫ్యాన్స్ అమితమైన ప్రేమ, అభిమానం చూపించడం..వారికి గుడికి కట్టేయడం వంటివి ఎక్కువగా కోలీవుడ్‌లో చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని విభిన్న రూపంలో చాటుకుంటున్నారు.

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటూ రామ్‌ని అభిమానించే సందీప్‌ అనే వ్యక్తి  తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కారు. సినిమా బ్లాక్ బాస్టర్ అయి రామ్‌కు పునర్వైభవం రావాలని కోరుకుంటున్నట్లు చెప్తూ  ఆ వీడియోను ట్వీట్‌ చేశారు. దీన్ని చూసిన రామ్‌ ఎమోషనల్ అయ్యారు.

‘ప్రియమైన సందీప్‌ నీ వీడియో చూశాను. మీరు ఇప్పడు బాగున్నారని ఆశిస్తున్నా. నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది, బాధించింది, షాక్‌కు గురి చేసింది. మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై కురిపించడానికి నేనేం చేశానో అర్థం కావడం లేదు. కానీ మీలాంటి వారి కోసం నా గుండెకొట్టుకుంటూనే ఉంటుంది. మీకు ఎప్పుడూ రుణపడి ఉంటా’ అని ఓ పోస్ట్‌ చేశారు.

కాగా  ఈ విషయంపై నటి, ‘ఇస్మార్ట్ శంకర్’ కో ప్రొడ్యూసర్ ఛార్మీ కూడా రియాక్టయ్యారు. నీ అభిమానం మాకు కన్నీళ్లు తెప్పించింది అంటూ ట్వీట్ చేశారు.