లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ సేవలు కొనసాగిస్తా

రోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు, సిబ్బందికి నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం..

లాక్‌డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ సేవలు కొనసాగిస్తా
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 2:38 PM

రోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్యాన్సర్ రోగులకు, శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హాస్పిటల్లోని రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు, సిబ్బందితో పాటు హాస్పిటల్లో సేవలందిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉండేందుకు నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మితుకుమల్లి భరత్, జేఎస్ఆర్ ప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!