తమిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ !
తమిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్హాసన్ కాంబినేషన్లో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళ తంబీలు పండుగ చేసుకునే మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతోంది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్హాసన్ కాంబినేషన్లో ఓ చిత్రం త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తెలిపారు.
కమల్హాసన్ ఓన్ బ్యానర్ రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇటీవల ‘ఖైదీ’తో ఈ దర్శకుడు సూపర్హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రజనీ – కమల్ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. “త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ వివరాల్ని ప్రకటిస్తుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడటం మరీ తొందరపాటు అవుతుంది. ప్రజంట్ చర్చలు జరుగుతున్నాయి” అన్నారు. దీన్నిబట్టి ఈ స్టార్ హీరోలు కలిసి నటించే సినిమా దాదాపు కన్ఫామ్ అయినట్లే అనిపిస్తోంది. రజనీ – కమల్ తమిళంలో పది సినిమాల్లో కలిసి నటించారు.
Also Read :