నిఖిల్ ఈ సారైనా మాట నిలుపుకుంటాడా..!

టాలీవుడ్‌‌లో మంచి పేరు సాధించిన యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ఆ తరువాత సినిమాలతో అంత మెప్పించలేకపోయాడు. అయితే స్వామి రారాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ యంగ్ హీరో.. విభిన్న కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది ‘కిరాక్ పార్టీ’తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో.. ఆ తరువాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. కాగా ఈయన నటించిన […]

నిఖిల్ ఈ సారైనా మాట నిలుపుకుంటాడా..!
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 5:38 PM

టాలీవుడ్‌‌లో మంచి పేరు సాధించిన యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ఆ తరువాత సినిమాలతో అంత మెప్పించలేకపోయాడు. అయితే స్వామి రారాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ యంగ్ హీరో.. విభిన్న కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది ‘కిరాక్ పార్టీ’తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో.. ఆ తరువాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. కాగా ఈయన నటించిన మరో చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోకపోవడం గమనర్హం.

నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన కణిథన్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. మాతృకలో దర్శకత్వం వహించిన టీఎన్ సంతోష్ తెలుగు రీమేక్‌ను డైరక్ట్ చేశారు. అయితే ఏ ముహూర్తాన ఈ మూవీ ప్రారంభమైందో కానీ.. అప్పటి నుంచి దీనికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ముందుగా ఈ మూవీ టైటిల్ విషయంలో పెద్ద వివాదమే జరిగింది. ఈ మూవీకి అప్పట్లో ‘ముద్ర’ అనే టైటిల్‌ను పెట్టారు. కానీ అదే పేరును మరో నిర్మాత ఫిలింనగర్‌లో రిజిస్టర్ చేయించడం.. ఆ విషయాన్ని ఆయన సుస్పష్టంగా వివరించడంతో.. చివరకు నిఖిల్ టీమ్ తలొగ్గి పేరును అర్జున్ సురవరంగా మార్చుకుంది. ఇక ఆ తరువాత ఈ మూవీ విడుదల డేట్ చెప్పిన ప్రతిసారి వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న నిఖిల్.. ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు. నవంబర్ 8న అర్జున్ సురవరంను విడుదల చేయబోతున్నట్లు ఆయన ఆ షోలో వివరించారు. కానీ ఎందుకు లేటవుతుందో మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు. దీంతో ఈసారైనా నిఖిల్ తన మాటను నిలుపుకుంటాడేమో చూడాలంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నప్పటికీ.. విడుదల విషయంలో డిలే జరుగుతూ రావడం గమనర్హం.

కాగా ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించగా.. ఆయన సరసన లావణ్య త్రిపాఠి నటించింది. వెన్నెల కిశోర్, నాగినీడు, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఠాగూర్ మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.