యమునా తీరంలో.. “డ్రీమ్ గాళ్” పర్ఫార్మెన్స్.. వావ్
ఒకప్పుడు తన డ్యాన్సులతో చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి దాకా ఓ ఊపు ఊపిన.. బీజేపీ ఎంపీ హేమామాలిని మధురలోని బృందావనంలో ఉన్న శ్రీరాధా రమన్ ఆలయంలో నృత్యం చేశారు. హరియాలీ తీజ్ సందర్భంగా జులన్ ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నారు. మహాకవి జయదేవ్ రాసిన గీత గోవిందంలోని యుమునా తీరే.. ధీర సమీరే అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఆమె చేసిన నృత్యాన్ని […]
ఒకప్పుడు తన డ్యాన్సులతో చిన్న పిల్లవాడి నుంచి ముసలివాడి దాకా ఓ ఊపు ఊపిన.. బీజేపీ ఎంపీ హేమామాలిని మధురలోని బృందావనంలో ఉన్న శ్రీరాధా రమన్ ఆలయంలో నృత్యం చేశారు. హరియాలీ తీజ్ సందర్భంగా జులన్ ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన నృత్యంతో భక్తులను ఆకట్టుకున్నారు. మహాకవి జయదేవ్ రాసిన గీత గోవిందంలోని యుమునా తీరే.. ధీర సమీరే అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఆమె చేసిన నృత్యాన్ని నియోజకవర్గ ప్రజలు, భక్తులు తిలకించి హేమామాలినిని అభినందించారు.