వర్ష బీభత్సం.. సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి.!
హైదరాబాద్లో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం నిండుప్రాణాన్ని బలిగొంది. దిల్షుక్నగర్లో ఓ చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
Heavy Water In Cellar: హైదరాబాద్లో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం నిండుప్రాణాన్ని బలిగొంది. దిల్షుక్నగర్లో ఓ చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వర్షం కారణంగా దిల్షుక్నగర్ సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అజిత్ సాయి అనే మూడేళ్ల బాలుడు ఉదయాన్నే ఆడుకుంటూ సెల్లార్ వైపుగా వెళ్లి నీటిలో పడి చనిపోయాడు. తండ్రి గమనించి బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే బాబు చనిపోయాడని నిర్ధారణ చేశారు. ఈ ప్రమాదంపై సరూర్నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఏపీలో రేపట్నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవు..!