హిమాచల్ ప్రదేశ్ను కప్పేసిన మంచు దుప్పటి.. పర్యాటకులు బయటకు రావద్దంటూ అధికారుల హెచ్చరికలు..
హిమాచల్ ప్రదేశ్ అంతటా తీవ్రంగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా అనేక ప్రాంతాలల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు మంచుతో..
Heavy Snowfall : హిమాచల్ ప్రదేశ్ అంతటా తీవ్రంగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా అనేక ప్రాంతాలల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు మంచుతో కప్పుకుపోయాయి. రహదారులపై అడుగు లోతులో మంచు పేరుకుపోవడంతో..ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు మంచులో కూరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.
లాహౌల్-స్పిత్ జిల్లాలోని సిసు వద్ద జాతీయ రహదారిపై పరిస్థితి కాస్త భయానకంగా కనిపించింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు. కాగా శీతాకాలంలో సిమ్లా అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే హిమాచల్ వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్నారు. మంచులో ఆనందంగా గుడుపుతున్నారు. మరోవైపు రానున్నరానున్న 24 గంట్లలో మంచు మరింత కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. సిమ్లాలో ఉష్ణోగ్రత్తలు పూర్తిగా పడిపోవడంతో పాటు పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో ఉనా, బిరాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, మండి ప్రాంతాల్లో ఉరుములు, వడగళ్ళు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఏపీలో లోకల్ ఎలక్షన్ పంచాయితీ.. నేడు సుప్రీంకోర్టులో కీలక వాదనలు..అందరిలో ఇదే ఉత్కంఠ
ఆల్టైమ్ గరిష్ట రికార్డును క్రాస్ చేసిన పెట్రోల్ ధరలు.. ముంబై తర్వాత స్థానానికి చేరిన హైదరాబాద్..