పాక్ కాల్పుల్లో ధ్వంసమైన సరిహద్దు గ్రామల ఇళ్లు
పాక్ జరుపుతున్న కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కథువా జిల్లాలోని హీరా నగర్ సెక్టార్ సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు..
పాక్ జరుపుతున్న కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కథువా జిల్లాలోని హీరా నగర్ సెక్టార్ సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో సరిహద్దు గ్రామాల్లోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నిత్యం పాక్ కాల్పులకు దిగుతోందని.. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. రాత్రి 10.00 గంటల తర్వాత కాల్పులకు దిగుతోందని.. ఉదయం 5.00 గంటల వరకు కొనసాగుతోందని తెలిపారు. తమ ఇళ్లపై పాక్ పేల్చిన తూటాలు పడుతున్నాయని.. కొన్ని చిన్నచిన్న షెల్స్ను ప్రయోగిస్తోందన్నారు. అంతేకాదు చిన్నచిన్న రాకెట్ లాంచర్లను కూడా ఉపయోగించడం ద్వారా.. తమ ఇంటి గోడలు ధ్వంసమవుతున్నాయని.. కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
J&K: Heavy shelling by Pakistani has damaged several houses in the border village of Hiranagar sector Kathua district. Locals say, “We are suffering every day because of frequent ceasefire violations by Pakistan. The firing starts at around 10 pm and continues till 5 am.” pic.twitter.com/CHm9jWkTtJ
— ANI (@ANI) August 21, 2020
Read More :