మంటలు పుట్టిస్తోన్న ఎండలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులతో కూడిన గాలులు వీస్తుండటంతో.. ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల వరకూ.. వడగాల్పులతో పాటు ఎండ సెగ కూడా ఉండనున్నట్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులతో కూడిన గాలులు వీస్తుండటంతో.. ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల వరకూ.. వడగాల్పులతో పాటు ఎండ సెగ కూడా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో గాలిలో తేమ తగ్గిపోవడమే ఈ ఎండలకు కారణమని అధికారులు చెబుతున్నారు. కాగా తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగంల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, భూపాల పల్లి, సూర్యాపేట ప్రాంతాల్లోనూ ఎండలు దంచుతున్నాయి. అలాగే హైదరాబాద్లో 42 డిగ్రీలు, మిగిలిన ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకున్నాయి. రాగల నాలుగు రోజుల్లోనూ గుంటూరు జిల్లా రెంట చింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తెలిపారు. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక రెంటచింతలలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయన్నారు. అందులోనూ 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది.
ఇది కూడా చదవండి:
ఇట్స్ అఫీషియల్ అంటూ పెళ్లి వార్తను ప్రకటించిన రానా
వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..
‘కరోనా కాలర్ ట్యూన్’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్తో దాన్ని కట్ చేయండి