ఈ మూడు పదార్థాలు తిన్నాక వేడి నీరు లేదా చాయ్ అస్సలు తాగకూడదు.. స్లో పాయిజన్గా పనిచేస్తుంది.. ఏంటో తెలుసుకోండి..
వర్షకాలంలో పాలు, పెరుగు అస్సలు తీసుకోవద్దు. కానీ పెరుగు తిన్న తర్వాత వేడి నీరు లేదా చాయ్ అస్సలు తీసుకోవద్దు. అవును నిజమే పెరుగు తీసుకున్న తర్వాత వేడి నీరు, చాయ్
సాధారణంగా చాలా మందికి ఏదైనా ఆహారాన్ని తీసుకున్న తర్వాత నీరు తాగడం అలవాటు ఉంటుంది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం కోసం ఎక్కువగా వేడి నీరు తీసుకుంటున్నారు. కానీ తరచూ వేడి నీరు తీసుకోవడం కూడా ప్రమాదమే.. ఆహారం తీసుకునేటప్పుడు లేదా తీసుకున్న తర్వాత వేడి నీరు లేదా చాయ్ అస్సలు తీసుకోవద్దు. ఇలా తాగడం వలన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా మూడు పదార్థాలు తీసుకున్న తర్వాత వేడి నీరు లేదా హాట్ డ్రింక్స్, చాయ్, కాఫీ అస్సలు తీసుకోవద్దు. అవెంటో తెలుసుకుందామా.
పెరుగు.. వర్షకాలంలో పాలు, పెరుగు అస్సలు తీసుకోవద్దు. కానీ పెరుగు తిన్న తర్వాత వేడి నీరు లేదా చాయ్ అస్సలు తీసుకోవద్దు. అవును నిజమే పెరుగు తీసుకున్న తర్వాత వేడి నీరు, చాయ్ వంటి హాట్ డ్రింక్స్ మాత్రం తీసుకోవద్దు.
తేనె.. ప్రపంచంలో తేనె ఇష్టపడని వారుండరు. చాలా మంది తేనెను బరువు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వలన బరువు తగ్గుతారని నమ్ముతారు. కానీ తేనెను ఎప్పుడూ వేడి నీళ్లతో కలిపి తీసుకోవద్దు. ఒకవేళ తేనె తిన్న తర్వాత కూడా వేడి నీళ్లు తాగకూడదు.
మద్యం.. కొందరికి రోజూ మద్యం తాగడం అలవాటు ఉంటుంది. మద్యం తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మద్యం తాగిన తర్వాత వేడి నీరు లేదా మరే ఇతర హాట్ డ్రింక్స్ తీసుకోవద్దు. ఆల్కహల్ తాగిన తర్వాత ఇతర డ్రింక్స్ తాగకూడదు. ముఖ్యం హాట్ డ్రింక్స్.
పెరుగు తిన్న తర్వాత వేడి నీరు లేదా హాట్ డ్రింక్స్ తీసుకోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. జీర్ణక్రియ అధ్వాన్నంగా మారుతుంది. తేనె తిన్న తర్వాత వేడి నీరు లేదా హాట్ డ్రింక్స్ తీసుకోవడం వలన శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. ఆల్కహల్ తీసుకున్న తర్వాత వేడి నీరు లేదా మరే ఇతర హాట్ డ్రింక్స్ తీసుకోవడం వలన వాంతులు అవుతాయి.
Note: ఈ కథనం కేవలం నిపుణుల అభిప్రాయాలు, సూచనలు, నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. సలహాల కోసం వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.