బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు వరం.. అందుబాటులోకి ట్యూమర్ను మాయం చేసే మెడిసెన్..
ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియని క్యాన్సర్ వ్యాధికి ఎటువంటి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందో తెలియని పరిస్థితులు. రకరకాల క్యాన్సర్లతో వైద్యులకు ఓ సవాల్ విసురుతోంది ఈ వ్యాధి. క్యాన్సర్తో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నవారున్నారు. ఈ క్యాన్సర్..
ఎందుకు వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియని క్యాన్సర్ వ్యాధికి ఎటువంటి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందో తెలియని పరిస్థితులు. రకరకాల క్యాన్సర్లతో వైద్యులకు ఓ సవాల్ విసురుతోంది ఈ వ్యాధి. క్యాన్సర్తో ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నవారున్నారు. ఈ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు ఆరోగ్య నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీని ఫలితాలు కూడా కన్పిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ రోగుల్లో ట్యూమర్ ను మాయం చేసే డ్రగ్ను అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పరిశోధనలు, ట్రయల్స్ పూర్తయ్యాయి. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలకు ఇంగ్లండ్కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) ఓ గుడ్ న్యూస్ అందించింది. బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో ట్యూమర్ (కణితి) ని మాయం చేసే లైఫ్ సేవింగ్ డ్రగ్ ను తీసుకొచ్చింది. ప్రతి ఏడాది 1600 మంది మహిళల్లో ఉపయోగించడానికి పెంబ్రోలిజుమాబ్ అనే ఔషధానికి ఆమోదం లభించింది. ఈ డ్రగ్ ట్యూమర్ను శరీరం నుంచి తొలగించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా అనేక రకాలున్నాయి. వీటిలో ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర రకాల రొమ్ము క్యాన్సర్ల కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. రొమ్ము క్యాన్సర్ మరణాల్లో నాలుగింట ఒక వంతు మరణాలకు ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కారణమవుతుంది. అయితే ఐదు కేసులలో ఒకరు మాత్రమే ఈ రకమైన క్యాన్సర్తో బాధపడుతున్నారని ఎన్ఎస్ఎస్ తెలిపింది.
కీమోథెరపీతో ఈ డ్రగ్ ఉపయోగించినప్పుడు రొమ్ము క్యాన్సర్ వృద్ధిని రెండొంతుల వరకు తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఈ ఔషదం వాడటం ద్వారా కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ ఔషదం దోహదపడుతుంది.
ఈ ఔషదంపై ఇంగ్లాండ్ కు చెందిన ఎన్హెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమండా ప్రిచర్డ్ మాట్లాడుతూ.. మహిళలకు నిజంగా శుభవార్త అని, తీవ్రమైన రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ప్రాణాలను రక్షించే ఔషధాన్ని రూపొందించడానికి ఎన్హెచ్ఎస్ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఈ ఔషదం వరం లాంటిదన్నారు. రాబోయే సంవత్సరాల్లో వచ్చే ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్ వ్యాప్తంగా సుమారు 1,600 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుందన్నారు. ఇప్పటికే వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఎంతో ఆశాజనకంగా ఉంటుందని, క్యాన్సర్ వ్యాధి పురోగమించకుండా నిరోధించడం, ప్రజలు సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఈ ఔషదం సహాయపడుతుందని ప్రిచర్డ్ పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ కొత్త డ్రగ్ను అందిస్తారని, దీని ఆధారంగా ఎలాంటి రోగులు ఈ డ్రగ్ ద్వారా చికిత్సకు అత్యంత అనుకూలంగా ఉంటారో వైద్యులు అంచనా వేస్తారని ఎన్హెచ్ఎస్ నివేదిక పేర్కొంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..