Danger Bells: చక్కెరను అతిగా వాడుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.. శరీరంలోకి వెళ్లిన చక్కెర కేన్సర్ కణాలకు అలా ఉపయోగపడుతుందట..
తీపి ఎక్కువగా తింటున్నారా? మీరు తీసుకునే ఆహారంలో చక్కెరను అతిగా వినియోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! చక్కెరను అతిగా తీసుకుంటే పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు...
Danger Bells: తీపి ఎక్కువగా తింటున్నారా? మీరు తీసుకునే ఆహారంలో చక్కెరను అతిగా వినియోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! చక్కెరను అతిగా తీసుకుంటే పెను ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చక్కెరను అతిగా వాడితే శరీరంలో కేన్సర్ ట్యూమర్లు పెరిగే అవకాశం ఉందని బెల్జియం శాస్త్రవేత్తలు ఓ ప్రయోగంలో తేల్చారు. ఈ విషయంపై దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన బెల్జియానికి చెందిన శాస్త్రవేత్తల బృందం.. చివరికి కీలక విషయాన్ని నిర్ధారించారు. శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం.. మిఠాయిలు, తీపి పదార్థాలు తినడం ద్వారా మన శరీరంలోకి వెళ్లిన చక్కెర పులిసిపోతుందట. అలా పులిసిపోయిన చక్కెరను మన శరీరంలో ఉన్న కేన్సర్ కణాలు వాడుకుని శక్తిని పొందుతాయట. దీంతో మనుషుల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందట. మరి ఇకనైనా అందరూ జాగ్రత్తపడండి.
Also Read:
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ.. ప్రయాణికులకు ఫుల్ క్లారిటీ..
చెన్నై ఐఐటీలో కలకలం…. మళ్లీ లాక్డౌన్ నిబంధనలు అమలులోకి … కరోనా బారిన పడిన విద్యార్థులెందరంటే…