Lalu Prasad Health Condition : అత్యంత విషమంగా లాలూ ప్రసాద్ ఆరోగ్యం.. రిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు రాంచీలోని రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
Lalu Prasad Health Condition : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు రాంచీలోని రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలే ప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం విషమించడంతో రాంచిలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు. లాలూ కిడ్నీలు 75 శాతం చెడిపోయాయని రిమ్స్ డాక్టర్లు తెలిపారు. పరిస్థితిని బట్టి ఆయనకు డయాలలిస్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు లాలూ చిన్నకుమారుడు బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, లాలూ సతీమణి రబ్రీ దేవి ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీ వెళ్లారు.
లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళకరంగా ఉందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ గత నెలలోనే తెలిపారు. ఆయన కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తున్నాయని.. పరిస్థితి ఏ క్షణంలోనే అయినా విషమించే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని లాలూ చికిత్స పొందుతున్న రాంచీలోని రిమ్స్ అధికారులకు ఉమేశ్ ప్రసాద్ రాతపూర్వకంగా తెలియజేశారు.
లాలూ కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తోందని తాను గతంలోనే చెప్పాలని ఉమేశ్ ప్రసాద్ అన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా విషమించవచ్చని తెలిపారు. లాలూ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆయనను మరో ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. డయాబెటిస్ కారణంగా అవయవాలు దెబ్బతిన్న వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎలాంటి మందులు లేవని వైద్యులు తెలిపారు.