తుపాకీతో కాల్చుకుని హెడ్కానిస్టేబుల్ మృతి
నిజామాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఇందల్ వాయి మండల పోలీస్ స్టేషన్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డికి..స్థానిక ఎస్సైకి మధ్య ఓ కేసు విషయంలో వివాదం తలెత్తినట్లుగా సమాచారం. ఆ గొడవతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఈ క్రమంలోనే కానిస్టేబుల్ […]
నిజామాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ఇందల్ వాయి మండల పోలీస్ స్టేషన్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డికి..స్థానిక ఎస్సైకి మధ్య ఓ కేసు విషయంలో వివాదం తలెత్తినట్లుగా సమాచారం. ఆ గొడవతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని ఈ క్రమంలోనే కానిస్టేబుల్ ప్రకాశ్రెడ్డి తుపాకీతో కాల్చుకున్నట్లుగా తెలుస్తోంది. మృతుడు ప్రకాశ్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మ గుట్ట నివాసి, ఇతనికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. మరో ఎనిమిది నెలల్లో ప్రకాశ్రెడ్డి రిటైర్మెంట్ కావాల్సి ఉండగా, ఈ ఘటన జరగడంతో స్థానికంగా సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న సీపీ కార్తీకేయ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు సేకరించిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు పోలీసు ఉన్నతాధికారులు.