“ధోనీలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం”
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు పేసర్ మహ్మద్ షమి. ధోనితో ఉన్న అనుబంధాన్ని ఇన్స్టా లైవ్ చాట్లో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. “ఐపీఎల్ తప్ప మిగిలిన అన్ని ఫార్మాట్లలో ధోనీతో కలిసి ఆడాను. అతడు చాలా గొప్ప ప్లేయర్. నాకు తనతో చాలా అనుభవాలున్నాయి. ఇప్పుడు కూడా ధోని మళ్లీ జట్టులోకి వస్తాడని అనుకుంటున్నాం. అతడితో ఆడటం చాలా బాగుంటుంది. ధోనీ ఎప్పుడూ సింగిల్ గా ఉండటానికి […]
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చాలా మిస్సవుతున్నట్లు చెప్పాడు పేసర్ మహ్మద్ షమి. ధోనితో ఉన్న అనుబంధాన్ని ఇన్స్టా లైవ్ చాట్లో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.
“ఐపీఎల్ తప్ప మిగిలిన అన్ని ఫార్మాట్లలో ధోనీతో కలిసి ఆడాను. అతడు చాలా గొప్ప ప్లేయర్. నాకు తనతో చాలా అనుభవాలున్నాయి. ఇప్పుడు కూడా ధోని మళ్లీ జట్టులోకి వస్తాడని అనుకుంటున్నాం. అతడితో ఆడటం చాలా బాగుంటుంది. ధోనీ ఎప్పుడూ సింగిల్ గా ఉండటానికి ఇష్టపడడు. అతడి చుట్టూ ఎవరో ఒకరు ఉండాల్సిందే. చుట్టూ నలుగురితో కూర్చోని భోజనం చేయడానికి ధోని ఇష్టపడతాడు. అతడిలో ఆ క్వాలిటీ నాకు బాగా నచ్చుతుంది. రాత్రంతా మేము మాట్లాడుకున్న అనుభవవాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కొల్పోతున్నాం” అని షమి పేర్కొన్నాడు.
వరల్డ్ కప్ అనంతరం క్రికెట్ కు దూరమైన ధోని ఆటను ఐపీఎల్ వేదికగా వీక్షించాలనుకున్న అభిమానులకు కోవిడ్-19 పెద్ద అడ్డంకిగా మారింది. ఈ మహమ్మారి కారణంగా టోర్నమెంటు ఉంటుందా..ఉండదా అన్న పరిస్థితి ఏర్పడింది. జులై నుంచి క్రికెట్ మ్యాచ్లు తిరిగి స్టార్ట్ చెయ్యాలని భావిస్తోంది బీసీసీఐ.