ఒప్పుకున్న చిరు.. ఊపిరి పీల్చుకున్న దర్శకుడు..!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో కొన్ని సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి హిట్ ఫ్లాప్లను పట్టించుకోకుండా పలువురు దర్శకులకు ఆయన ఓకే చెప్పారు
Megastar Chiranjeevi News: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో కొన్ని సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి హిట్ ఫ్లాప్లను పట్టించుకోకుండా పలువురు దర్శకులకు ఆయన ఓకే చెప్పారు. అందులో మెహర్ రమేష్ ఒకరు. మెహర్ దర్శకత్వంలో వేదాళం రీమేక్లో నటించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు. ఇక ఇటీవల ఈ మూవీకి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్ని రెడీ చేసిన ఈ దర్శకుడు, చిరుకు చూపించారట. అదంతా నచ్చడంతో చిరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో మెహర్ రమేష్ ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తుండగా.. ఈ మూవీ పూర్తైన తరువాత వేదాళం రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. ఇక ఇందులో చిరు చెల్లెలి పాత్రకు గానూ సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని అనిల్ సుంకర, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు సమాచారం.
Read More: