హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత

హర్యానాలో భారీగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన తనిఖీల్లో 62 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పల్వాల్‌ జిల్లాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 331 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, గత కొద్ది రోజులుగా స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ […]

హర్యానాలో భారీగా గంజాయి పట్టివేత
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 8:38 PM

హర్యానాలో భారీగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ జరిపిన తనిఖీల్లో 62 ప్యాకెట్ల గంజాయిని పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని పల్వాల్‌ జిల్లాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 331 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ జరుపుతున్న వరుస దాడుల్లో పెద్ద ఎత్తున గంజాయితో పాటు.. ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి