హరితహారం కింద.. 4వేల పంచాయతీల్లో.. తాటి, ఈత మొక్కలు: శ్రీనివాస్గౌడ్
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం హరితహారం తో దూసుకుపోతోంది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం హరితహారం తో దూసుకుపోతోంది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 4000 గ్రామ పంచాయతీల పరిధిలో తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటాలని ఆ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 1000 చొప్పున మొక్కలను నాటాలన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆరో విడత హరితహారం కార్యక్రమంపై శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు.
[svt-event date=”05/07/2020,1:48AM” class=”svt-cd-green” ]
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ కు హరితహారం కార్యక్రమము లో భాగంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో తాటి , ఈత వనాలే లక్ష్యం గా మొక్కలు నాటాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. pic.twitter.com/ouQHb30DYW
— V Srinivas Goud (@VSrinivasGoud) July 4, 2020
[/svt-event]