మానవ హక్కుల సంఘాలు ఎక్కడ..హరీశ్ శంకర్ సంచలన ట్వీట్..
బుల్లెట్ల లాంటి డైలాగ్స్..వెంట్రుకలు నిక్కపొడచుకునే ఎలివేషన్స్.. ఇవి హరీశ్ శంకర్ సినిమాల గురించి మాట్లాడుకుంటే గుర్తుకువచ్చేవి. అయితే ట్విట్టర్ లో సామాజిక అంశాలపై కూడా అదే స్థాయిలో చెలరేగిపోతాడు ఈ ఊర మాస్ డైరెక్టర్. తాజాగా పౌర, మానవ హక్కుల సంఘాలపై తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇటీవల కాలంలో ప్రాణాలకు తెగించిన మరీ కరోనాపై పోరాడుతోన్న వైద్యులపై కొందరు దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. మన గాంధీ హాస్పటల్ లో కూడా ఇటువంటి దారుణ ఘటన జరగ్గా..సీఎం […]
బుల్లెట్ల లాంటి డైలాగ్స్..వెంట్రుకలు నిక్కపొడచుకునే ఎలివేషన్స్.. ఇవి హరీశ్ శంకర్ సినిమాల గురించి మాట్లాడుకుంటే గుర్తుకువచ్చేవి. అయితే ట్విట్టర్ లో సామాజిక అంశాలపై కూడా అదే స్థాయిలో చెలరేగిపోతాడు ఈ ఊర మాస్ డైరెక్టర్. తాజాగా పౌర, మానవ హక్కుల సంఘాలపై తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇటీవల కాలంలో ప్రాణాలకు తెగించిన మరీ కరోనాపై పోరాడుతోన్న వైద్యులపై కొందరు దాడులకు తెగబడుతోన్న విషయం తెలిసిందే. మన గాంధీ హాస్పటల్ లో కూడా ఇటువంటి దారుణ ఘటన జరగ్గా..సీఎం కేసీఆర్ సహా మంత్రులంతా ఘటనను ఖండించారు.
ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు డైరెక్టర్ హరీశ్ శంకర్. “డాక్టర్లు, నర్సులు….. పోలీస్ లు… పౌరులు, మానవులు కాదా..!!? ఇటీవల జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు…!! సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం ….. తోసుకుంటూ ముందుకొస్తారు …..” అంటూ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కాదు గతంలో కూడా సామాజిక, ప్రస్తుత ప్రజా సంబంధిత అంశాలపై సుత్తి లేకుండా స్ట్రైట్ గా స్పందిస్తాడు హరీశ్ శంకర్.
డాక్టర్లు, నర్సులు….. పోలీస్ లు పౌరులు, మానవులు కాదా..!!?
నిన్న జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు…!!
సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం ….. తోసుకుంటూ ముందుకొస్తారు …..
— Harish Shankar .S (@harish2you) April 2, 2020