సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు: మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భం గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో బుధవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భం గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దుబ్బాక ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
దుబ్బాక అభివృద్ధి బాధ్యత నేనే తీసుకుంటానని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట తరహాలో దుబ్బాకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. దుబ్బాక మహిళల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడించారు. నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాక అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. దుబ్బాక అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.35 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.