ఆసీస్ తో సిరీస్.. భారత్ కు ఎదురుదెబ్బ
ఈ నెల 24 నుండి భారత్ ఆస్ట్రేలియా తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోతోంది. అయితే ఈ సిరీస్ కు ముందే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. హార్దిక్ కు వెన్ను నొప్పి తిరబెట్టడంతో ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండదని బీసీసీఐ ప్రకటించింది. దీనితో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక హార్దిక్ ప్లేస్ లో […]
ఈ నెల 24 నుండి భారత్ ఆస్ట్రేలియా తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోతోంది. అయితే ఈ సిరీస్ కు ముందే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి కారణంగా ఈ సిరీస్ కు దూరమయ్యాడు. హార్దిక్ కు వెన్ను నొప్పి తిరబెట్టడంతో ఈ సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండదని బీసీసీఐ ప్రకటించింది. దీనితో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
ఇక హార్దిక్ ప్లేస్ లో వన్డేలకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా.. టీ20లకు మాత్రం ఇంకా ఎవర్నీ ప్రకటించలేదు. భారత్-ఆసీస్ జట్ల మధ్య ఈ ఆదివారం నుండి సిరీస్ ప్రారంభం కానుంది. తొలుత టీ20లు.. ఆపై ఐదు వన్డేలు జరగనున్నాయి.