‘ ఆ నలుగురినీ నేనే ఉరి తీస్తా ‘ మీరట్ తలారి
నిర్భయ కేసులో నలుగురు దోషులను తానే ఉరి తీస్తానని ప్రకటించాడు యూపీలోని మీరట్ వాసి పవన్ జలాద్.. వారి మృతితో తనకు, నిర్భయ తలిదండ్రులకు, ఈ దేశానికి ఎంతో ఊరట కలుగుతుందని చెప్పాడు. ఉరికి సంబంధించిన రిహార్సల్స్ కోసం రానున్న రోజుల్లో తాను ఢిల్లీకి వస్తానని, బహుశా తనకు ఈ మేరకు ఆదేశాలు అందవచ్చునని భావిస్తున్నానని ఆయన అన్నాడు. ఆ నలుగురు దోషుల ఉరితో నాకే కాదు.. నిర్భయ తలిదండ్రులకే కాక.. ఈ దేశానికి కూడా ఎంతో […]
నిర్భయ కేసులో నలుగురు దోషులను తానే ఉరి తీస్తానని ప్రకటించాడు యూపీలోని మీరట్ వాసి పవన్ జలాద్.. వారి మృతితో తనకు, నిర్భయ తలిదండ్రులకు, ఈ దేశానికి ఎంతో ఊరట కలుగుతుందని చెప్పాడు. ఉరికి సంబంధించిన రిహార్సల్స్ కోసం రానున్న రోజుల్లో తాను ఢిల్లీకి వస్తానని, బహుశా తనకు ఈ మేరకు ఆదేశాలు అందవచ్చునని భావిస్తున్నానని ఆయన అన్నాడు. ఆ నలుగురు దోషుల ఉరితో నాకే కాదు.. నిర్భయ తలిదండ్రులకే కాక.. ఈ దేశానికి కూడా ఎంతో రిలీఫ్ లభిస్తుంది అని పేర్కొన్నాడు.’ నాకు ఎక్కువ ప్రాక్టీసు కూడా అవసరం లేదు.. ఉరి తాడును, ఉరి తీసే స్థలాన్ని నేను పరిశీలించాల్సి ఉంటుంది.. అలాగే ఆ నలుగురు దోషుల ఎత్తు, బరువు తదితరాలను నేను కొలతలు తీసుకోవలసి ఉంటుంది..’ అని పవన్ జలాద్ వెల్లడించాడు. సాధ్యమైనంత త్వరగా ఆ దోషుల ఉరితీత జరగాలని నేనుకోరుకుంటున్నా అన్నాడాయన..