ఉత్తర ప్రదేశ్..కరోనా రోగుల్లో సగంమంది యువతేనట !
సాధారణంగా వయసు మళ్లినవారికి, పిల్లలకు కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందనే అభిప్రాయానికి విరుద్డంగా యూపీలోని కరోనా రోగుల్లో సగం మంది 40 ఏళ్ళ లోపువారేనట..21-40 ఏళ్ళ మధ్య వయసున్న వారు కూడా ఈ వైరస్..
సాధారణంగా వయసు మళ్లినవారికి, పిల్లలకు కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందనే అభిప్రాయానికి విరుద్డంగా యూపీలోని కరోనా రోగుల్లో సగం మంది 40 ఏళ్ళ లోపువారేనట..21-40 ఏళ్ళ మధ్య వయసున్న వారు కూడా ఈ వైరస్ కి గురికావడం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలో 7,884 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ వయస్సు వారి శాతం 51.93 ఉంది. అటు ఇక్కడ రీకవరీ రేటు 60.85 శాతం ఉండడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న 52.95 శాతం కన్నా ఎక్కువ. ఇక 41-60 ఏళ్ళ మధ్య వారి కేసులు 30 శాతం వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ కేసులను నియంత్రించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.