హత్రాస్ కుటుంబాన్ని ఐదు గంటలు విచారించిన సీబీఐ
హత్రాస్ కేసులో ఈ కుటుంబాన్ని సీబీఐ అధికారులు శనివారం ఐదు గంటలపాటు విచారించారు. మృతురాలి తల్లిని, వదినను వారు చాలాసేపు ప్రశ్నించినట్టు తెలిసింది.
హత్రాస్ కేసులో ఈ కుటుంబాన్ని సీబీఐ అధికారులు శనివారం ఐదు గంటలపాటు విచారించారు. మృతురాలి తల్లిని, వదినను వారు చాలాసేపు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కేసులో చోటూ అనే సాక్షి ఇఛ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని వారు ప్రశ్నలు గుప్పించారు. గతంలో నిందితుల్లో ఒకడితో బాధితురాలు జరిపిన కాల్ డిటెయిల్స్ ని కూడా వారు సేకరరించారు. ఈ నెల 13 న కూడా సీబీఐ సిబ్బంది హత్రాస్ కుటుంబాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.