అవినీతిని అరికడతామంటే.. భయమెందుకు బాబూ..? : జీవీఎల్
పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని అరికట్టి.. మరింత మెరుగ్గా చేస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినదాంట్లో అభ్యంతరం ఏముందని బీజేపీ సీనియర్ నేత జీవిఎల్ నరసింహారావు అన్నారు. పోలవరం కాంట్రాక్టు రద్దు విషయంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన విషయం నిజమేనని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. కాగా, రామాయపట్నం ఓడరేవు నిర్మించాలని జగన్ కేంద్రానికి చేసిన అభ్యర్థనపై.. లిఖితపూర్వకంగా లేఖ ఇస్తే.. తాను […]
పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని అరికట్టి.. మరింత మెరుగ్గా చేస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినదాంట్లో అభ్యంతరం ఏముందని బీజేపీ సీనియర్ నేత జీవిఎల్ నరసింహారావు అన్నారు. పోలవరం కాంట్రాక్టు రద్దు విషయంలో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసిన విషయం నిజమేనని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు. కాగా, రామాయపట్నం ఓడరేవు నిర్మించాలని జగన్ కేంద్రానికి చేసిన అభ్యర్థనపై.. లిఖితపూర్వకంగా లేఖ ఇస్తే.. తాను కూడా సంబంధిత మంత్రిని కోరతానని జీవిఎల్ తెలిపారు.