మ్యాన్హోల్స్ను అక్కడ మనుషులు శుభ్రం చేయరు..
ఇక ముందు మనుషులను ఈ పనుల కోసం ఉపయోగించవద్దని నిర్ణయించింది. ఇందు కోసం రోబోలను సిద్దం చేసింది. అసోంలోని గువహతిలోగల మురుగునీటి మ్యాన్హోల్లను ఇకపై ఈ రోబోలు శుభ్రం....
Guwahati gets Robots to Clean Manholes : మ్యాన్హోల్లో శుభ్రం చేస్తుండగా కార్మికుడి మృతి.. మ్యాన్హోల్లో ఆక్సిజన్ అందకపోవడంతో.. శుభ్రం చేస్తున్న కార్మికులకు అస్వస్థత.. ఇలాంటి వార్తలను మనం నిత్యం వింటూ వుంటాం. అయితే ఇలాంటి పనులకు మనుషులను ఉపయోగించే వ్యవస్థకు స్వస్థి చెప్పంది అసోం సర్కార్. ఇక ముందు మనుషులను ఈ పనుల కోసం ఉపయోగించవద్దని నిర్ణయించింది. ఇందు కోసం రోబోలను సిద్దం చేసింది.
అసోంలోని గువహతిలోగల మురుగునీటి మ్యాన్హోల్లను ఇకపై ఈ రోబోలు శుభ్రం చేయనున్నాయి. నగరంలో మురుగునీటి మ్యాన్హోల్స్ను పరిశుభ్రం చేసేందుకు వినియోగించే రోబోను గువాహతి అభివృద్ధిశాఖ (జీడీడీ) మంత్రి సిద్ధార్థ్ భట్టాచార్య ప్రారంభించారు. ఈ రోబో సేవల వినియోగంతో మ్యాన్హోళ్ల దగ్గర క్రమక్రమంగా కార్మికుల చేత పనిచేయించడాన్ని తగ్గించనున్నామన్నారు.
బండీకూట్ అనే రోబోను గువహతి మునిసిపల్ కార్పొరేషన్ కొనుగోలు చేసిందన్నారు. దీనిలో జేసీబీ నుంచి కనెక్ట్ అయ్యే ఆరు స్కిడ్ స్టీర్ లోడర్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. దేశంలో ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను గురుగ్రామ్, కోయంబత్తూర్లో వినియోగిస్తున్నారు. ఆ తరువాత స్థానంలో మ్యాన్హోల్స్ను శుభ్రం చేయడానికి రోబోలను ఉపయోగిస్తన్నది అసోం చేరింది. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసిన దేశంలోని మూడవ నగరంగా గువహతి నిలిచింది.