హోం మంత్రి మహమూద్ అలీ, మండలి ఛైర్మన్ గుత్తా దిగ్భ్రాంతి
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్తులైన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఆయన ఎనలేని సేవలందించారని గుత్తా సుఖేందర్ రెడ్డి […]
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్వర్గస్తులైన మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గారి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కార్మిక నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఆయన ఎనలేని సేవలందించారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారితో కలిసి నర్సన్న పోరాటం చేసారని, తెలంగాణ రాష్ట్ర తొలి హో మినిష్టర్ గా పని చేసి రాష్టా శాంతి భద్రతలు కాపాడటంలో నాయిని నర్సింహారెడ్డి గారు చాలా కృషి చేశారని గుత్తా తెలిపారు. నాయిని ఆత్మకు శాంతిచేకూరాలని కోరుతూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సుఖేందర్ రెడ్డి తెలిపారు.
మరోవైపు, అపోలో ఆసుపత్రిలో నాయిని భౌతిక దేహానికి హోం మంత్రి మహమూద్ అలీ నివాళులు అర్పించారు. నాయిని కుటుంబ సభ్యులను ఓదార్చారు. టిఆర్ఎస్ సీనియర్ నేత మరణించడం తీరని లోటుగా పేర్కొన్న అలీ, కేసీఆర్ కి ఆత్మీయ లీడర్ గా నర్సన్న ఉండేవారని పేర్కొన్నారు. నాయని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు… వారంలో రెండు మూడు సార్లు తరచూ మాట్లాడుతూ ఉండేవాడు అని అలీ తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.