గాడ్సేకు ఫ్యాన్ క్లబ్ ఉందని నాకు తెలీదే: గుత్తా జ్వాలా చురకలు
గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని తనకు తెలీదని బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా వ్యాఖ్యానించారు. బాపును చంపడాన్ని ఇంకా కొందరు సమర్ధిస్తుంటే తనకు ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నారు. దీని బట్టి చూస్తుంటే భవిష్యత్లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మరని.. ఈ పరిస్థితులను చూస్తుంటే భయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు గుత్తా జ్వాలా. Never knew there was a GODSE […]
గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని తనకు తెలీదని బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా వ్యాఖ్యానించారు. బాపును చంపడాన్ని ఇంకా కొందరు సమర్ధిస్తుంటే తనకు ఆశ్చర్యంగా ఉందని ఆమె అన్నారు. దీని బట్టి చూస్తుంటే భవిష్యత్లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మరని.. ఈ పరిస్థితులను చూస్తుంటే భయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు గుత్తా జ్వాలా.
Never knew there was a GODSE FAN CLUB ??So many justifying his actions!! It’s literally telling us and the children of our country not to believe our history..what we were taught!! This is damn scary! ? #Election2019 #hittingnewlow
— Gutta Jwala (@Guttajwala) May 18, 2019
కాగా స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని.. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే మొదటి ఉగ్రవాది అంటూ కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పలువురు ఖండించగా.. బీజేపీ నేతలు ప్రజ్ఙా సాధ్వీ సింగ్ గాడ్సేను దేశభక్తుడంటూ పొగిడారు. అలాగే కేంద్రమంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్లు గాడ్సేను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.