చాక్లెట్స్, స్వీట్స్ ఆశజూపి ముగ్గురు బాలికలపై అత్యాచారం

ఇంటికి పిలిచి చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి అభం శుభం తెలియని ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.

చాక్లెట్స్, స్వీట్స్ ఆశజూపి ముగ్గురు బాలికలపై అత్యాచారం
Follow us

|

Updated on: Oct 09, 2020 | 12:50 PM

ప్రభుత్వ చట్టాలు ఎంత కఠినంగా ఉన్న కామాంధుల అగడాలకు కళ్లెం పడటంలేదు. దేశంలో నిత్యం ఏదోచోట అమాయకులను లోబర్చుకుని ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కీచకులు. తాజాగా గుజరాత్ దారుణ ఘటన జరిగింది. ఇంటికి పిలిచి చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి అభం శుభం తెలియని ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో ఈ దారుణ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడోదర నగరంలోని మకరపురా ప్రాంతానికి చెందిన రజనీకాంత్ మహతో అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను ఇంటికి పిలిపించుకున్నాడు. బాలికలకు చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి గదిలోకి తీసుకువెళ్లి వారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అతను చేసే దుర్మార్గాన్ని కూడా బాలికలు గ్రహించలేకపోయారు. ఇలా రజనీకాంత్ మహతో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

అయితే, పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై ఉపాధ్యాయురాలు చెప్పడంతో తరగతి గదిలోని ఓ బాలిక రోదించింది. దీంతో ఆ విద్యార్థిని టీచర్ ఆరా తీయడంతో తాను అత్యాచారానికి గురైనట్లు గుర్తించింది. కుటుంబసభ్యులకు విషయం వెల్లడించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. ముగ్గురు బాలికలపై తాను అత్యాచారం చేశానని అంగీకరించడంతో రజనీకాంత్ మహతోను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర బాలికలపై కూడా నిందితుడు అత్యాచారం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.