అక్కడ మాస్క్ ధరించకుంటే.. ఇక నుంచి రూ.1000 ఫైన్!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పాటించడంలో పలువురు గుజరాతీలు అశ్రద్ధ చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నా
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పాటించడంలో పలువురు గుజరాత్ ప్రజలు అశ్రద్ధ చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నా చాలా మంది పట్టించుకోవడంలేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మాస్కు ధరించకపోతే రూ.200గా ఉన్న ఫైన్ను ఇక నుంచి ఏకంగా రూ.1000కి పెంచింది. ఈ పెంపు ఆగస్టు 11 నుంచి అమల్లోకి వస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు.
గుజరాత్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్రతిరోజు వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా 1,078 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,064కు చేరింది. ఇక గుజరాత్లో కరోనా మరణాలు కూడా క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 25 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 2,654కు చేరింది.
Read More:
గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్టీ-పీసీఆర్ ద్వారా కరోనా టెస్ట్..!
తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్..!