కశ్మీర్‌పై మరోసారి తలతిక్క కామెంట్లు చేసిన టర్కీ అధ్యక్షుడు

టర్కీ అధ్యక్షుడు రీసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి కశ్మీర్‌పై అడ్డదిడ్డంగా వాగారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల భాగంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తన వర్చువల్‌ సందేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు.

కశ్మీర్‌పై మరోసారి తలతిక్క కామెంట్లు చేసిన టర్కీ అధ్యక్షుడు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 11:43 AM

టర్కీ అధ్యక్షుడు రీసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి కశ్మీర్‌పై అడ్డదిడ్డంగా వాగారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల భాగంగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ తన వర్చువల్‌ సందేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. ద‌క్షిణ ఆసియాలో శాంతికి క‌శ్మీర్ స‌మ‌స్య కీల‌క‌మ‌ని, అది ఇంకా ర‌గులుతూనే ఉన్న‌ద‌ని, క‌శ్మీర్‌లో 370 ఆర్టిక‌ల్ ర‌ద్దుతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా త‌యారైంద‌ని ఆరోపించారు.. యూఎన్‌ ఆదేశాలకు అనుగుణంగా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అక్కడికేదో యూఎన్‌ బాబ్బాబు కశ్మీర్‌ సమస్యను మీరు పరిష్కరించాలి అని బతిమాలినట్టుగా బిల్డప్‌ ఇచ్చుకున్నారు. అయితే కశ్మీర్‌పై ఎర్డోగాన్‌ చేసిన తలతిక్క వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది.. యూఎన్‌లో భార‌త ప్ర‌తినిధిగా ప‌నిచేస్తున్న‌ ‌తిరుమూర్తి త‌న ట్విట్ట‌ర్‌లో ఎర్డ‌గోన్‌ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని టర్కీ తెలుసుకుంటే మంచిదని హితవు చెప్పారాయన. యూఎన్‌లో మాట్లాడాలనుకుంటే సొంత పాలసీలపై ఎంతైనా మాట్లాడుకోవచ్చని తిరుమూర్తి టర్కీకి హెచ్చరికలతో కూడిన సలహా ఇచ్చారు. పాకిస్తాన్‌తో దోస్తానా ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ఇంతకు ముందు కూడా కశ్మీర్‌పై అవాకులు చవాకులు పేలారు.. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై కూడా పిచ్చి కామెంట్లు చేశారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని, ఇందులో వేరొకరి జోక్యం అవసరం లేదని భారత్‌ చాలా సార్లు స్పష్టం చేసింది…